లఖింపూర్, ఆగస్టు 19: డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు రైతన్నలు సిద్ధం కావాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పిలుపునిచ్చారు. మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీ జిల్లా రాజాపూర్ మండి సమితి వద్ద ప్రారంభమైన 72 గంటల నిరసన దీక్ష శుక్రవారం విజయవంతంగా కొనసాగింది.
దేశవ్యాప్త నిరసనలకు సరైన సమయంలో సరైన వేదిక, విధానం గురించి ఎస్కేఎం నేతలు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారని తెలిపారు. కేంద్రమంత్రి అజయ్మిశ్రాను లఖింపూర్ కేసులో నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. జైళ్లలో మగ్గుతున్న రైతులను విడిచిపెట్టాలని, మద్దతుధరపై చట్టం తీసుకురావాలని, విద్యు త్తు సవరణ బిల్లు ఉపసంహరణ, చెరు కు బకాయిలు చెల్లింపు, రైతులకు భూ హక్కులు కల్పించాలని ఎస్కేఎం డిమాండ్ చేస్తున్నది.