న్యూఢిల్లీ : భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు ఎఫ్సీఐ గోడౌన్లను లూటీ చేసేందుకు సమయం ఆసన్నమైందన్న ఆయన ఆ తర్వాత తన ట్వీట్ను డిలీట్ చేశారు. ప్రైవేట్ గోడౌన్లలో ఆహార ధాన్యాలను నిల్వ చేస్తే ప్రజలు ఆకలితో మరణిస్తారని రాకేష్ తికాయత్ తన వ్యాఖ్యలపై తర్వాత వివరణ ఇచ్చారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళన ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఆగదని స్పష్టం చేశారు. కొవిడ్-19 పేరుతో కేంద్ర ప్రభుత్వం రైతులను భయపెట్టడం మానుకోవాలని ఆయన కేంద్రానికి హితవు పలికారు. దేశంలో కర్ఫ్యూ, లాక్డౌన్లు విధించినా రైతు ఉద్యమం కొనసాగి తీరుతుందని అన్నారు.