న్యూఢిల్లీ: ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా ఈ నెల 24న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిరసన చేస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయిత్ తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన పలు రైతు సంఘాల నేతలు సోమవారం సమావేశమయ్యారు. త్రివిధ దళాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జూన్ 24న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, తహసీల్ ప్రధాన కార్యాలయాల్లో ఐక్య కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు చేస్తామని రాకేష్ తికాయిత్ తెలిపారు. హర్యానాలోని కర్నాల్లో సోమవారం జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిరసనలకు యువజనులు, పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) 30 ప్రదర్శనలతోపాటు ఈ నెల 24న జరిగే నిరసనలో కూడా పాల్గొంటుందని రాకేష్ తికాయిత్ వెల్లడించారు.
కాగా, కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో వందలాది ఉత్తరాది రైతులు దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఏడాదికిపైగా నిరసనలు కొనసాగించారు. దీంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం వివాదస్పదంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్ను కూడా వెనక్కి తీసుకోవాలంటూ యువత దేశ వ్యాప్తంగా నిరసనలను తీవ్రం చేస్తున్నది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కూడా దీనికి మద్దతు తెలిపింది. ఈ నెల 24న దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
संयुक्त किसान मोर्चा का 24 जून को अग्निपथयोजना के खिलाफ देशभर में जिला-तहसील मुख्यालयों पर विरोधप्रदर्शन।SKMकॉर्डिनेशन कमेटी का करनाल में फैसला।युवा-नागरिक संगठनों-पार्टियों से जुटने की अपील।भाकियू 30 के प्रदर्शन के बजाय 24 के फैसले में ही शामिल। @ANI @PTI_News #YouthEmpowerment pic.twitter.com/NFaGjYEiNM
— Rakesh Tikait (@RakeshTikaitBKU) June 20, 2022