న్యూఢిల్లీ, మార్చి 11: కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ పేర్కొన్నారు. భారతదేశ పటాన్ని ఈడీ భిన్నకోణంలో చూస్తున్నదని, కేవలం ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాలనే లక్ష్యంగా చేసుకుంటున్నదని, బీజేపీ పాలిత రాష్ర్టాల వైపు ఈడీ వెళ్లదని ఆరోపించారు. అన్యాయంపై పోరాడేందుకు కపిల్ సిబల్ ప్రారంభించిన ‘ఇన్సాఫ్’ తొలి సభ శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరిగింది.
బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి వీడి అనేక ఏండ్లు గడిచాయని, ఇప్పుడు జేడీయూ, ఆర్జేడీ కలుస్తున్నందుకే అకస్మాత్తుగా ఆయనపై కేసులు గుర్తొచ్చాయని కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తున్నదని, ఇవేం రాజకీయాలని ఆయన ప్రశ్నించారు.