న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న వేళ మత ఘర్షణలను బీజేపీ పావుగా ఉపయోగించనున్నదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్లో ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు అందుకు ‘ట్రైలర్’ అని ట్వీట్లో తెలిపారు.
విద్వేష ప్రసంగం; మైనారిటీలకు ఎర వేయడం.. ఈడీ, సీబీఐ, ఈసీలను ఉపయోగించి విపక్షాలను వేధించడాన్ని బీజేపీ పావులుగా వాడుకోవాలనుకుంటున్నదని వెల్లడించారు. బెంగాల్ను దహనం చేయడం, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో మత హింసకు ఆజ్యం పోయడం అందుకు ట్రైలర్ అని సిబల్ పేర్కొన్నారు.