న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల మొదటి వారంలో 52.30 శాతం సభా సమయాన్ని రాజ్యసభ కోల్పోయింది. అంతరాయాలు, బలవంతపు వాయిదాల కారణంగా గత శుక్రవారంతో ముగిసిన శీతాకాల సమావేశాల మొదటి వారంలో షెడ్యూల్ చేసిన సమావేశ సమయంలో 52.30 శాతం వృథా అయినట్లు రాజ్యసభ పేర్కొంది. గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో మహిళా సెక్యూరిటీ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన 12 మంది సభ్యులను ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.
ఈ పరిణామాల వల్ల సమావేశాల సమయం వృథా కావడంపై రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రులతో ఆయన చర్చించారు. 12 మంది సభ్యుల సస్పెన్షన్ను ఎత్తివేయాలన్న విపక్షాల డిమాండ్పై ఇరు పక్షాలు చర్చించి ఒక అభిప్రాయానికి రావాలని కోరారు.