న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా మళ్లీ హరివంశ్ నారాయణ్ సింగ్నే కొనసాగించాలని అధికార ఎన్డీయే వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ పదవీ కాలం ముగిసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి ఆయననే నామినేట్ చేయగా, ప్రస్తుతం ఆ పదవిలో హరివంశ్ కొనసాగుతున్నారు. తిరిగి ఆయన్ని ఎన్నుకోవటంపై కేంద్ర మంత్రి, రాజ్యసభ నాయకుడు నడ్డా విపక్ష పార్టీల నాయకులతో చర్చిస్తున్నట్టు తెలిసింది.
మోదీ సర్కార్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయకపోవటంతో 2019 నుంచి అది ఖాళీగా ఉంది. దీనిపై శ్రద్ధ చూపకుండా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని భర్తీ చేయడానికి అధికార బీజేపీ ఆత్రుత పడుతున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మోదీ సర్కార్ తీరుపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. డిప్యూటీ చైర్మన్ పదవికి నోటిఫికేషన్ రాకపోయినా 16న ప్రారంభమయ్యే సమావేశాల్లో ఎన్నిక ఉండొచ్చని తెలిసింది.