ADR Report | రాజ్యసభకు అభ్యర్థుల్లో 36శాతం మందిపై క్రిమినల్ కేసులో నమోదయ్యాయి. ఈ విషయం ఓ నివేదిక వెల్లడించింది. 15 రాష్ట్రాలకు చెందిన 58 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించిన అనంతరం.. అభ్యర్థుల ఆగస్టు ఆస్తుల విలువ రూ.127.81కోట్లుగా ఉందని ఏడీఆర్ తెలిపింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక ప్రకారం.. 59 మంది అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల రేసులో ఉన్నారు. అయితే, కర్ణాటక కాంగ్రెస్ అభ్యర్థి జీసీ చంద్రశేఖర్ అఫిడవిట్ మాత్రం విశ్లేషించలేకపోయారు.
స్కాన్ చేసిన పత్రాలు చదవడం సాధ్యం కాలేదని.. దాంతో 58 మంది అభ్యర్థుల అఫిడవిట్లను మాత్రమే పరిశీలించినట్లు నివేదిక పేర్కొంది. ఇందులో 36శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 17శాతం మంది తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ అభ్యర్థిపై హత్యాయత్నం ఆరోపణలున్నాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 30 మంది బీజేపీ అభ్యర్థుల్లో 8 మంది, తొమ్మిది మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆరుగురు, పశ్చిమ బెంగాల్లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురిలో ఒకరిపై, ఇద్దరు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఏపీలో వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురిలో ఒకరు, ఆర్జేడీకి చెందిన ముగ్గురిలో ఒకరి, ఒడిశాలోని అధికార బీజేడీ నుంచి ఒక అభ్యర్థి కేసు క్రిమినల్ కేసులున్నాయి. వీరంతా అఫిడవిట్లలో క్రిమినల్ కేసులున్నట్లుగా అంగీకరించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల ఆర్థిక పరిస్థితిని సైతం అంచనా వేసింది. దాదాపు 21శాతం మంది అభ్యర్థులు బిలియనర్లీ కాగా.. రూ.100కోట్లకుపైగా ఆస్తులున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ.127.81 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది.