న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ విపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. వెల్లో కూర్చుని నినాదాలు చేశారు. సభ జరుగుతుండగా నినాదాలతో అడ్డుకున్నారు. 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ విపక్ష సభ్యులు సభలో ఆందోళన సృష్టించారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైర్మెన్ వెంకయ్య తెలిపినా.. కొందరు విపక్ష సభ్యలు వెల్ను వీడలేదు. దీంతో చైర్మెన్ వెంకయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో హుందాగా వ్యవహరించాలని కోరారు. అయినా విపక్ష సభ్యలు వినలేదు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ సింగ్ గట్టి అరిచారు. చైర్నే సవాల్ చేస్తున్నారని సంజయ్పై చైర్మెన్ సీరియస్ అయ్యారు. ఎంపీ సంజయ్ సింగ్ను సభ నుంచి బయటకు పంపించాలని చైర్మెన్ వెంకయ్య అక్కడ ఉన్న మార్షల్స్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత విపక్ష సభ్యులు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేశారు. 12 మందిపై వేటును ఎత్తివేయాలని పార్లమెంట్ భవనం నుంచి విజయ్చౌక్ వరకు విపక్ష సభ్యులు ర్యాలీ తీశారు.