Rajya Sabha: మహారాష్ట్రలో ఇటీవల ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు పోటీపడుతున్న ఆరుగురు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ముగ్గురిని పోటీలో నిలిపింది. ఈ మధ్యే కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ సీఎం అశోక్చవాన్తోపాటు మాజీ ఎమ్మెల్యే మేధా కులకర్ణి, ఆరెస్సెస్ కార్యకర్త అజిత్ గోప్చాడేలను బీజేపీ తరఫున రాజ్యసభ బరిలో ఉన్నారు.
ఇక బీజేపీ మిత్రపక్షాలైన ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఒక స్థానంలో, అజిత్ పవార్ వర్గం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో తమ అభ్యర్థులను పోటీలో పెట్టాయి. ఏక్నాథ్ షిండే శివసేన నుంచి మిలింద్ దేవ్రా, అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో పోటీపడింది. దళిత నాయకుడు చంద్రకాంత్ హండోర్ను బరిలో దింపింది.
ఈ ఆరుగురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల స్క్రూటినీ అనంతరం మొత్తం ఆరు స్థానాల్లో ఒక్కొక్కరే బరిలో నిలువడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.