న్యూఢిల్లీ: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ కూలిన ఘటనపై రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ( Rajnath Singh ) పార్లమెంటులో ప్రకటన చేయనున్నారు. పార్లమెంటులో ప్రకటన అనంతరం ఆయన ఘటనా ప్రాంతానికి బయలుదేరి వెళ్లనున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్ తన కుటుంబసభ్యులు, సిబ్బందితో కలిపి మొత్తం 14 మందితో తమిళనాడులోని సలూన్ నుంచి వెల్లింగ్టన్కు వెళ్తుండగా కూనురు ఏరియాలో నీలగిరి కొండల్లో కుప్పకూలింది.
ఆ వెంటనే హెలిక్యాప్టర్కు మంటలంటుకుని కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో నలుగురిని సైన్యం రక్షించి వెల్లింగ్టన్లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించింది. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్తోపాటు వారి కుమార్తెకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉన్నది.