బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో రికార్డుస్థాయిలో 45 రోజుల్లోనే డీఆర్డీఓ నిర్మించిన ఏడు అంతస్తుల భవనాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై, డీఆర్డీఓ చీఫ్ సతీశ్రెడ్డి పాల్గొన్నారు. ఈ భవనాన్ని అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) అభివృద్ధి, పరిశోధనకు వినియోగించనున్నారు.
దీన్ని సంప్రదాయ, ప్రీ ఇంజినీరింగ్ అండ్ ప్రీకాస్ట్ మెథడాలజీతో బెంగళూరులోని హైబ్రిడ్ టెక్నాలజీతో ఏడీఈ వద్ద విమాన నియంత్రణ వ్యవస్థ కోసం డీఆర్డీఓ రికార్డు స్థాయిలో 45 రోజుల్లోనే భవనాన్ని నిర్మించింది. ఈ ఐదవతరం స్వదేశీ ఏఎంసీఏ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సౌకర్యాలను అందించనున్నది. భవనాన్ని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించగా.. ఆయనకు భవనంలోనే ప్రాజెక్టుపై ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు డీఆర్డీవో వర్గాలు తెలిపాయి.
Defence Minister Rajnath Singh inaugurates FCS Complex at Aeronautical Development Establishment (ADE) at Bengaluru
Karnataka CM Basavaraj Bommai and DRDO Chief G Satheesh Reddy also present pic.twitter.com/QlZvt1LvPT
— ANI (@ANI) March 17, 2022