Rajkumar Anand | ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్లోకి కొత్త ముఖం చేరనున్నది. ఎమ్మెల్యే రాజ్కుమార్ ఆనంద్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారు. త్వరలో రాజ్కుమార్ ఆనంద్ చేత లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణం చేయించే అవకాశాలు ఉన్నాయి.
పటేల్ నగర్ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్కుమార్ ఆనంద్ మంత్రి కానున్నారు. ఈ మేరకు ఎల్జీ సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం రాజీనామా చేసిన రాజేంద్ర పాల్ గౌతమ్ స్థానంలో ఆనంద్కు అవకాశం లభించింది. దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న రాజేంద్రపాల్ గౌతమ్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదముద్ర వేశారు.
జాతవ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన రాజ్కుమార్ ఆనంద్.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రముఖులలో ఒకరు. ఆప్ అధినేత కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. రాజ్కుమార్ ఆనంద్ ఉత్తరప్రదేశ్లో ఉన్నతాభ్యాసం పూర్తి చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన భార్య వీణా ఆనంద్ కూడా 2013 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.