న్యూఢిల్లీ, మే 12: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా రాజీవ్ కుమార్ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగియనున్నది. రాజీవ్ ఆదివారం సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదాలో రాజీవ్ 2025 వరకు కొనసాగుతారు.