న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రొడక్షన్, మెకానికల్, సివిల్, మైనింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెటీరియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హ్యూమన్ రిసోర్స్, కంపెనీ సెక్రెటరీ, రాజ్భాష అధికారి, లీగల్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు తాండూర్, బొకజాన్, రాజ్బన్, కర్పొరేట్ ఆఫీస్లలో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. వీరిని ఏడాది కాలపరిమితికే తీసుకోనున్నప్పటికీ.. మూడేండ్ల వరకు పొడిగించే అవకాశం ఉన్నది.
మొత్తం పోస్టులు: 46
ఇందులో ఇంజినీర్ 29, ఆఫీసర్ 17 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్, డీగ్రీ, పీజీ చేయాలి. అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: http://www.cciltd.in/