జైపూర్ : ఈద్కు ముందు ఓ వ్యక్తి తన గొర్రె పిల్లకు ఏకంగా రూ. కోటి ఆఫర్ వచ్చినా అమ్మేందుకు నిరాకరించాడు. జంతువు పొట్టపై ఇస్లాంలో పవిత్రంగా భావించే 786 అనే నెంబర్ రాసిఉంది. గొర్రె పిల్లకు అత్యధిక ధర పలకడంతో రాజస్ధాన్లోని తారానగర్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ఉదంతం హాట్ టాపిక్గా మారింది. అసలు గొర్రె పిల్ల శరీరంపై ఏం రాసి ఉందనేది దాని యజమాని రాజు సింగ్కు తెలియదు.
కొందరు ముస్లింలు తనను కలిసిన మీదట గొర్రెపై 786 నెంబర్లు రాసిఉన్నాయని అతడికి తెలిసింది. ముస్లింలకు తన గొర్రె పిల్ల ఎంత ముఖ్యమైనదైనా దానితో తన అనుబంధం ఎంతో విలువైనదని, దాన్ని విక్రయించేందుకు తాను సుముఖంగా లేనని రాజు సింగ్ తేల్చిచెప్పాడు.
గత ఏడాది గొర్రె పిల్ల జన్మించిందని, స్ధానికులు దీనికి వేలం నిర్వహించగా కొందరు రూ. 70 లక్షలు చెల్లిస్తామని ముందుకొచ్చినా అమ్మేందుకు తాను సిద్ధంగా లేనని సింగ్ చెప్పాడు. గొర్రె పిల్లకు దానిమ్మ, పపాయ, మిల్లెట్స్, కూరగాయలను సింగ్ ఆహారంగా అందిస్తున్నాడు. ఇక గొర్రె పిల్లకు భారీ ధర పలకడంతో ముందు జాగ్రత్తగా గొర్రె పిల్లను అతడు తన ఇంటి నుంచి బయటకు రాకుండా చూసుకుంటున్నాడు.
Read More :
Heavy rain warning | దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ