జైపూర్: రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు కరోనా పాజిటివ్ వచ్చింది. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా ఇవాళ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే ఆయనకు కరోనా సంబంధ అనారోగ్య లక్షణాలేవీ లేవని రాజస్థాన్ రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నాడని తెలిపాయి.