అహ్మదాబాద్ : మంత్రులు హుందాగా వ్యవహరించాలని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడరాదని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అన్నారు. తన నియోజకవర్గంలో రోడ్లు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బుగ్గల తరహాలో ఉండాలని మంత్రి రాజేంద్ర సింగ్ గుధా చేసిన వ్యాఖ్యలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా వేదికలపై మాట్లాడే సమయంలో మంత్రులు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.
మంత్రి ఏ సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని..అయితే ప్రతి ఒక్కరూ హుందాగా ఉండాలని, మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజా వేదికలపై మరింత హుందాగా వ్యవహరిస్తూ తమ ప్రవర్తన, ప్రసంగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. మంత్రులు హద్దు మీరి వ్యవహరిస్తే ఎవరూ హర్షించరని అన్నారు. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తొలి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గెహ్లోత్ సూరత్కు వచ్చారు.