జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(CM Ashok Gehlot), ప్రధాని మోదీ మధ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరం కొనసాగుతోంది. రాజస్థాన్లో ఇవాళ ప్రధాని మోదీ టూర్ చేస్తున్నారు. ఆయన సికార్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమానికి సీఎం గెహ్లాట్ వెళ్లడం లేదు. తన ప్రసంగాన్ని తొలగించడం వల్లే ఆ కార్యక్రమానికి వెళ్లడం లేదని సీఎం గెహ్లాట్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీకి కేవలం ట్విట్టర్లోనే వెల్కమ్ చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు. తనకు కేటాయించిన మూడు నిమిషాల ప్రసంగాన్ని తొలగించినందు వల్లే ఆ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు గెహ్లాట్ తెలిపారు.
माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी,
आज आप राजस्थान पधार रहे हैं। आपके कार्यालय PMO ने मेरा पूर्व निर्धारित 3 मिनट का संबोधन कार्यक्रम से हटा दिया है इसलिए मैं आपका भाषण के माध्यम से स्वागत नहीं कर सकूंगा अतः मैं इस ट्वीट के माध्यम से आपका राजस्थान में तहेदिल से स्वागत करता…— Ashok Gehlot (@ashokgehlot51) July 27, 2023
ఆ ఆరోపణలపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేందుకు గెహ్లాట్ను ఆహ్వానించామని, ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్పీచ్ కూడా కేటాయించామని, కానీ సీఎం హాజరుకావడం లేదని సీఎంవోనే పేర్కొన్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ట్వీట్లో తెలిపింది. అభివృద్ధి పనులకు చెందిన శిలాఫలకంపై సీఎం పేరు ఉన్నట్లు కూడా పీఎంవో వెల్లడించింది.
Shri @ashokgehlot51 Ji,
In accordance with protocol, you have been duly invited and your speech was also slotted. But, your office said you will not be able to join.
During PM @narendramodi’s previous visits as well you have always been invited and you have also graced those… https://t.co/BHQkHCHJzQ
— PMO India (@PMOIndia) July 27, 2023
రాజస్థాన్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ విజిట్ చేయడం ఇది ఏడోసారి. అయితే కొన్ని రోజుల క్రితం మణిపూర్ ఘటన విషయంలో ప్రధాని మోదీపై సీఎం గెహ్లాట్ విమర్శలు చేశారు. దౌసా, సిరోహి, అజ్మీర్, బికనీర్ పట్టణాల్లో జరిగిన కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. ఇక ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఉన్న సికర్ జిల్లాలోనూ పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. జాట్ వర్గం ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఆధిపత్యం కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి.