బెంగళూరు, జనవరి 24: బెంగళూరులో మంగళవారం ఉదయం నోట్ల వర్షం కురిసింది. ఓ వ్యక్తి ఫ్లైఓవర్ పై నుంచి పది రూపాయల నోట్లను వెదజల్లాడు. దీంతో ఫ్లైఓవర్ కింద ఉన్నవాళ్లు నోట్లను తీసుకోవడానికి ఎగబడ్డారు. దీంతో కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఆ వ్యక్తి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.