బెంగళూరు : భారతీయ రైల్వేల్లో గూడ్స్ రైళ్లు కీలకపాత్రను పోషిస్తున్నాయి. నిత్యం బొగ్గు, ఇంధనం, సరుకులను రవాణా చేస్తున్నాయి. బైక్లు, ట్రాక్టర్లను, లారీలను తరలించడం తదితర వాహనాలను సైతం తరలించడం చూస్తూ వచ్చాం. తాజాగా భారతీయ రైల్వే మరో ఘనతను సాధించింది. దేశంలో మొదటిసారిగా ఆర్టీసీ బస్సులను రవాణా చేసింది. కర్నాటకలోని బెంగళూరు నుంచి చండీగఢ్కు బస్సులను తరలించారు.
హిమాచల్ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన 300 బస్సులను రైలుమార్గం ద్వారా రవాణా చేస్తున్నది. ఈ బస్సులను బెంగళూరు హోసూరులోని అశోక్ లేలాండ్ యూనిట్లలో తయారు చేశారు. వీటిని రోడ్డు మార్గంలో తరలించాలంటే పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్న పని. దీనికి తోడు ఇంధన ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ద్వారా చవకగా రవాణా చేయొచ్చని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నది. ఆర్టీసీ చెందిన బస్సులను గూడ్స్ రైళ్లలో తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.‘బెంగళూరు నుంచి ఆటోమొబైల్ రవాణాలో సరికొత్త మైలురాయి’ అంటూ సౌత్ వెస్ట్రన్ రైల్వే ట్వీట్ చేసింది. బెంగళూరు నుంచి 2,825 కిలోమీటర్ల దూరంలో ఉన్న చండీగఢ్కు గూడ్స్ రైలుద్వారా రవాణా చేయగా.. ఐదు రోజుల తర్వాత చండీగఢ్కు చేరుకునే అవకాశం ఉంది. అశోక్ లేలాండ్ ప్రొడక్షన్ 300 బస్సులను రవాణా చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
Buses on Train!
Transporting passenger buses for the first time. pic.twitter.com/QWggwXfww1
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 18, 2022