కొచ్చి: సమయ పాలన పాటించనందుకు రైల్వేకు వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా విధించింది. 2018లో కార్తీక్ మోహన్ ఎర్నాకులం నుంచి చెన్నైకి టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే నిర్దేశించిన సమయం కన్నా దాదాపు 13 గంటల ఆలస్యంగా రైలు వచ్చింది. రైలు ఆలస్యం కారణంగా అత్యవసర సమావేశానికి హాజరుకాలేకపోయానని మోహన్ ఫిర్యాదును ఫోరం సమర్థించింది.