జల్నా: కరోనా మహమ్మారి వల్ల రైల్వేలకు రూ.36 వేల కోట్ల నష్టం వాటిల్లిందని రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే చెప్పారు. భారతీయ రైల్వేలకు గూడ్స్ రైళ్లతోనే నిజమైన ఆదాయం వస్తుందని అన్నారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని జల్నా రైల్వేస్టేషన్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రావ్ సాహెబ్ దన్వే మాట్లాడుతూ .. “ప్యాసింజర్ రైళ్ల విభాగం ఎల్లవేళలా నష్టాల్లోనే నడుస్తుంది. ప్రయాణ టికెట్ల ధరలు పెంచితే ప్యాసింజర్లపై ప్రభావం పడుతుంది.. మేం ఆ పని చేయలేం. కరోనా వల్ల రైల్వేలకు రూ.36 వేల కోట్ల నష్టం వాటిల్లింది” అని అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై-నాగ్పూర్ ఎక్స్ప్రెస్వేతోపాటు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం అవుతుందన్నారు.