హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి కార్మికనగర్లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మహ్మద్ సిద్దిక్ అహ్మద్(38) అనే వ్యక్తిని దుండగులు ఇంట్లోనే హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి పరారయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టైలర్గా పనిచేసే అహ్మద్, ఇతని భార్య రుబినా స్థానికంగా అద్దెకు ఉంటున్నారు. రుబినా రెండు రోజులక్రితం పుట్టింటికి వెళ్లింది.
రుబినా వెళ్లినప్పటి నుంచి అహ్మద్ బయటకు రాకపోవడంతో ఇంటి యజమానికి అనుమానం కలిగింది. రుబినాను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్విచ్ఆఫ్ వచ్చింది. దీంతో ఇంటి యజమాని జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి డోర్ పగులగొట్టి చూడగా సగం శరీరం ఫ్రిడ్జ్లో ఉంది.
ఎవరో ఇతడిని చంపి ఫ్రిడ్జ్లో పెట్టినట్లుగా ఎస్హెచ్వో ఎస్.రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని తరలించాలనుకున్నప్పటికీ అనువైన సమయం చిక్కలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.