న్యూఢిల్లీ: వెయిటింగ్ లిస్టులు, ఆర్ఏసీల బాధల నుంచి త్వరలో రైల్వే ప్రయాణికులకు విముక్తి లభించనుంది. రూ.లక్ష కోట్లతో కేంద్రం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా దశలవారీగా పాత రైళ్లను తొలగించి వాటి స్థానంలో కొత్త రైళ్లను రానున్న సంవత్సరాల్లో తీసుకురానున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
సుమారు 7 వేల నుంచి 8 వేల జతల కొత్త రైళ్లను ఈ పథకంలో భాగంగా ప్రవేశపెట్టనున్నారు. నాలుగైదు ఏండ్లలో టెండర్ ప్రక్రియ చేపడతామన్నారు. 15 ఏండ్ల ఈ దీర్ఘకాల ప్రణాళికలో కొత్త కారిడార్లు ఏర్పాటు చేస్తామని, జీరో వెయిటింగ్ లిస్టు లక్ష్యంగా ఈ ప్రణాళిక చేపడుతున్నామన్నారు.