న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో రైతులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అరుణ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అరెస్టు అయ్యారు. అయితే ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను అరెస్టు చేయాలని, ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు రైల్ రోకో నిర్వహిస్తున్నారు. ఆరు గంటల పాటు రైల్ రోకో ఆందోళనకు రైతులు పిలుపునిచ్చారు. హర్యానాలోని బహదూర్ఘర్ వద్ద రైతులు పట్టాలపై కూర్చుని ఆందోళన నిర్వహించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది.