భోపాల్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఆయన టూర్ చేస్తున్నారు. అయితే ఒలింపిక్ మెడలిస్ట్, బాక్సర్, కాంగ్రెస్ నేత విజేందర్ సింగ్ ఆ ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్తో కలిసి విజేందర్ యాత్ర నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరూ తమ మీసాలు తిప్పారు.
భారత్ జోడో యాత్ర చేపడుతున్న రాహుల్ గాంధీ.. గడ్డం, మీసాలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. రాహుల్ హర్యాన్వీ స్టయిల్లో బాక్సర్తో కలిసి మీసాలు తిప్పారు. బాక్సింగ్ పంచ్ ఇస్తున్నట్లు కూడా ఫోజు ఇచ్చారు.
హర్యానాలోని భివాని జిల్లాకు చెందిన విజేందర్ సింగ్.. గత లోక్సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అతను బ్రాంజ్ మెడల్ గెలిచాడు.
बॉक्सिंग रिंग के अजेय योद्धा @boxervijender आज आपने #BharatJodoYatra में सड़क पर उतरकर खेत-खलिहान और युवाओं की आवाज़ को ताकत दी है।
शुक्रिया आपका…🙏🏻 pic.twitter.com/4oZOFqPdp9
— Congress (@INCIndia) November 25, 2022