Loksabha Elections 2024 : ఆరెస్సెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇవాళ కీలక పోరాటం జరుగుతున్నదని కాంగ్రెస్ ఎంపీ, వయనాద్ లోక్సభ అభ్యర్ధి రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాషాయ నేతలు, ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఒకే దేశం..ఒకే ఎన్నికలు, ఒకే నేత, ఒకే భాష అని మాట్లాడుతున్నారని, భాష గురించి ఏ ఒక్కరూ ప్రజలను నిర్ధేశించలేరని అన్నారు.
భాష అనేది మనిషి లోపలినుంచి, హృదయం నుంచి పలికేదని చెప్పారు. హిందీ కంటే మీ భాష తక్కువని కేరళక చెందిన వ్యక్తితో అనడమంటే అది కేరళ ప్రజలను అవమానించినట్టేనని పేర్కొన్నారు. వయనాద్ నియోజకవర్గంలో సోమవారం జరిగిన ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు.
భారత్కు ఒకే నేత ఉండాలనే ఆలోచన దేశంలో ప్రతి ఒక్కరికీ అవమానకరమని రాహుల్ అన్నారు. మత విద్వేషాలు రేకెత్తిస్తూ కాషాయ పార్టీ ప్రజల మధ్య విభజన చిచ్చు రేపుతోందని దుయ్యబట్టారు. ఇక జన్సంపర్క్ కార్యక్రమంలో భాగంగా రాహుల్ వయనాద్లో భారీ ర్యాలీ చేపట్టారు.
Read More :
Ram Navami | రామనవమికి ముస్తాబవుతున్న అయోధ్యానగరి.. వేడుకలకు 40 లక్షల మంది భక్తులు!