Rahul Gandhi | కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అధ్వాన్నంగా శిక్షణను ఇచ్చి అగ్ని వీరులను మోదీ సైన్యం సరిహద్దుల్లోకి పంపుతుందని మండిపడ్డారు. ఈ విషయంలో చైనా, పాకిస్థాన్ మనకంటే మెరుగైన శిక్షణ ఇస్తున్నాయని ఆయన విమర్శలు గుర్పించారు. బిహార్ రాజధాని పాట్నా గాంధీ మైదాన్లో జరిగిన మహాకూటమి జన్ విశ్వాస్ మహార్యాలీ జరిగింది. ఈ సందర్భంగా అగ్నివీరుల అంశంపై స్పందించారు. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ సైన్యంలో మోదీ అగ్నివీర్ స్కీమ్ను అమలు చేశారన్నారు.
అగ్నివీరులకు ఆరునెలల శిక్షణ ఇచ్చి నరేంద్ర మోదీ ప్రభుత్వ చైనా, పాక్ సైన్యాలను ఎదుర్కొనేందుకు పంపుతోందన్నారు. ఇది అన్యాయమని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు భయపడేది లేదన్న ఆయన.. వాటిని తొలగించి భారత ప్రభుత్వాన్ని నెలకొల్పుతామన్నారు. దేశంలో విద్వేషం వ్యాప్తిసుందన్న ఆయన.. ఎందుకు కారణాలపై ప్రశ్నించారు. దేశంలో ద్వేషానికి తావులేదని.. విద్వేషానికి కారణం అన్యాయం జరుగడమేనన్నారు. యువత, రైతులు, పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు.
మోదీ కోసం ఇద్దరు ముగ్గురు బిలియనీర్ల కోసం మాత్రమే పని చేస్తారన్నారు. లక్షల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని.. రైతుల రుణాలను మాత్రం ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలోని ఓడరేవులు, రైల్వేలు ఓ పారిశ్రామికవేత్తకు అప్పగించారని ఆరోపించారు. దేశంలో వెనుకబడిన.. అత్యంత వెనుకబడిన, దళిత, గిరిజన ప్రజల జనాభా 73శాతం ఉందని.. బడా కంపెనీల జాబితాలో చూస్తే ఈ వర్గాల నుంచి ఒక్క వ్యక్తి కనిపించడం లేదన్నారు. 73శాతం జనాభా నుంచి ఒక్క వ్యక్తి కార్పొరేట్ ఆసుపత్రిలో కనిపించడన్నారు. గతంలో పేదలకు ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు వచ్చేవని.. కానీ నరేంద్ర మోదీ అన్ని తలుపులు మూసివేశారని మండిపడ్డారు.