Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపీగా తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 19 సంవత్సరాలుగా ఈ ఇంటిని భారత ప్రజలు తనకు ఇచ్చారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇది వాస్తవం మాట్లాడినదానికి లభించిన మూల్యమని, నిజం మాట్లాడేందుకు ఎంతవరకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. రాహుల్ గాంధీ తుగ్లక్ లేన్లోని తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి తాళాలను సిబ్బందికి అందజేశారు. ఆయన వెంటన సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే వాయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్పై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని కోరగా.. శనివారం అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ప్రస్తుతం రాహుల్ తన తల్లి సోనియాతో కలిసి నివసిస్తుండగా.. త్వరలో ఆయన మరో ఇంటికి మారనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందిస్తూ.. రాహుల్ చర్య ఆదర్శప్రాయమన్నారు. ‘రాహుల్ గాంధీ లోక్సభ ఆదేశాల మేరకు తుగ్లక్ లేన్లో ఉన్న తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. అప్పీల్ చేసుకోవడానికి కోర్టు అతనికి 30 రోజుల సమయం ఇచ్చింది. హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు. కానీ, బంగ్లాను ఖాళీ చేయడం ఆయన తీసుకున్న నిర్ణయం నిబంధనల పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలుపుతుంది’ అంటూ ట్వీట్ చేశారు.
#WATCH | "People of Hindustan gave me this house for 19 years, I want to thank them. It's the price for speaking the truth. I am ready to pay any price for speaking the truth…," says Congress leader Rahul Gandhi as he finally vacates his official residence after… pic.twitter.com/hYsVjmetYw
— ANI (@ANI) April 22, 2023