ఉక్రెయిన్లోని భారతీయులు దుర్భర పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఇరుక్కుపోయిన భారతీయులను కేంద్రం వెంటనే సురక్షితంగా భారత్కు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఉక్రెయిన్లోని బంకర్లో ఉన్న కర్నాటక విద్యార్థులకు సంబంధించిన ఓ వీడియోను రాహుల్ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ఈ విజువల్స్లో ఉన్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రష్యా టార్గెట్గా ఉన్న తూర్పు ఉక్రెయిన్లో చాలా మంది ఇరుక్కుపోయారు. మరో సారి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ ఇరుక్కున భారతీయులు, భారతీయ విద్యార్థులను వెంటనే భారత్కు తీసుకుండి అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
భారతీయ విద్యార్థులతో ఎయిరిండియా విమానం ముంబైకి బయల్దేరిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రకటించారు. ఇందులో 219 మంది విద్యార్థులున్నారని పేర్కొన్నారు. ఉక్రెయిన్ పరిస్థితులను తమ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే వుందని, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు.