న్యూఢిల్లీ : ఎన్నికల నిబంధనలపై మాజీ ప్రధాని మన్మోహన్ వైఖరిని గుర్తు చేసుకున్నారు మాజీ సీఈసీ ఖురేషీ. ‘2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తమ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉద్యోగాలలో అందించే రిజర్వేషన్లను 4.5శాతం నుంచి 9 శాతం వరకు పెంచుతామని కొత్త హామీ ఇచ్చారు. కానీ అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో ఖుర్షీద్ను మేం తీవ్రంగా మందలించాం.
అప్పుడు కాంగ్రెస్ మంత్రులు అందరూ నన్ను అహంకారి అంటూ నిందించారు’ అని ఖురేషీ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మీడియా కార్యదర్శి హరీశ్ ఖరేకు వివరించగా.. మన్మోహన్ను కలిసే ఏర్పాటు చేశారని ఖురేషీ చెప్పుకొచ్చారు. తనను చూసిన వెంటనే మన్మోహన్ మాట్లాడుతూ..‘మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తే నేను ఆత్మహత్య చేసుకొంటా. విషయం తెలిసి ఉంటే వారిని తీవ్రంగా మందలించేవాడిని’ అని అన్నారు.