లక్నో : కాన్పూర్కు చెందిన పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్పై ఐటీ దాడుల్లో రూ 180 కోట్ల నగదు పట్టుబడటం కలకలం రేపగా తాజాగా మరో పెర్ఫ్యూమ్ వ్యాపారి, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్పై శుక్రవారం పన్ను అధికారులు దాడులు జరిపారు. పీయూష్ జైన్తో పాటు తన వ్యాపారాలతో ఎస్పీకి సంబంధం లేదని పుష్పరాజ్ జైన్ స్పష్టం చేశారు. పీయూష్ జైన్ ఎవరికి సన్నిహితమో ఆయన వివరాలు వెల్లడిస్తాయని వ్యాఖ్యానించారు.
2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుష్పరాజ్ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఇటీవల సమాజ్వాదీ అత్తరు (పెర్ఫ్యూమ్)ను ప్రారంభించారు. ఐటీ దాడులు జరిగిన సమయంలో తాను కన్నౌజ్లో లేనని 90 ఏండ్ల వయసున్న తన తల్లితో పాటు ముంబై వెళ్లామని, ఏడాదిలో మూడు నాలుగు సార్లు తాము ముంబై వెళతామని తన ఇల్లు వ్యాపారం కన్నౌజ్లోనే ఉన్నాయని పుష్పరాజ్ స్పష్టం చేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని అన్నారు. సమాజ్వాదీ పార్టీ కోసం తాను గతంలో రెండుసార్లు పెర్ఫ్యూమ్ లాంఛ్ చేశానని గుర్తుచేశారు.