న్యూఢిల్లీ, జూన్ 6: దేశీయంగా తయారైన రూ. 76,390 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డీఏసీ సోమవారం ఆమోదం తెలిపింది. ఇందులో నౌకాదళం కోసం రూ.36వేల కోట్లతో నెక్ట్స్ జనరేషన్ యుద్ధ నౌకలను కొనుగోలు చేయనున్నారు. నిఘా, ఎస్కార్ట్, తీరప్రాంత రక్షణకు ఇవి ఉపయోగపడతాయి. ఆర్మీ కోసం యుద్ధ వాహనాలు, యాంటి ట్యాంక్ గైడెడ్ క్షిపణులు కొననున్నారు. హెచ్ఏఎల్లో డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్-30 ఎంకేఐ ఏరో ఇంజన్ల తయారీకి కూడా డీఏసీ అనుమతించింది.