ఎన్కౌంటర్లో అంతమొందించిన పోలీసులు
అమృత్సర్, జూలై 20: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులను పోలీసులు మట్టుబెట్టారు. బుధవారం అమృత్సర్లో హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగరూప్సింగ్ రూపా, మన్ప్రీత్సింగ్ అలియాస్ మన్ను కుసాను అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లగా వారు పోలీసులపైకి కాల్పులు జరిపి తప్పించుకొనే ప్రయత్నం చేశారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుదాడికి దిగారు. దాదాపు 4 గంటల పాటు ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నిందితులిద్దరిని హతమార్చారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు, ఓ జర్నలిస్టుకు గాయాలయ్యాయి. వారిని సమీప దవాఖానకు తరలించామని పోలీసులు తెలిపారు.