చండీగఢ్, మే 16: గ్రామీణాభివృద్ధి నిధుల విడుదలలో కేంద్రం వైఫల్యంపై పంజాబ్ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నది. ఈ మేరకు సుప్రీం కోర్టు వేసవి సెలవుల్లోగా పిటిషన్ వేయాలని సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయించింది. కేంద్రం నుంచి రూ.4 వేల కోట్ల బకాయిలు రాష్ర్టానికి రావాల్సి ఉన్నదని పంజాబ్ సర్కారు తెలిపింది. గత ఏడాది రూ.3,200 కోట్ల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించిన రూరల్ డెవలప్మెంట్ ఫండ్ (ఆర్డీఎఫ్) సెస్ నిధులు, ఈ ఏడాది రూ.750 కోట్ల గోధుమల నిధులు పంజాబ్కు రావాల్సి ఉన్నాయి.