చండీగఢ్ : పంజాబ్ ఎన్నికల్లో ధన ప్రవాహం కొనసాగుతుండగా.. మద్యం ఏరులై పారుతున్నది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ నెల 18 వరకు రూ.46.66కోట్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారని, అలాగే రూ.2కోట్ల విలువైన 6.60లక్షల లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్లు సీఈవో డీఆర్ఎస్ కరుణ రాజు తెలిపారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ వింగ్ రూ.44.49కోట్ల సైకోట్రాఫిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయని, లెక్కల్లోకి రాని రూ.16లక్షల నగదును జప్తు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 3,90,275 లైసెన్స్ పొందిన లైసెన్స్డ్ ఆయుధాలు ఉండగా.. ఇందులో 91.10శాతం డిపాజిట్ అయ్యాయని.. అయితే, లైసెన్స్ లేకుండా ఉన్న 27 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.