చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ( Amarinder Singh ) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకోనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా సుఖ్దేవ్ సింగ్ ధిండ్సాకు చెందిన శిరోమణి అకాలీదల్ సంయుక్త్ (SAD Sanyukt) పార్టీతో కూడా వచ్చే ఎన్నికల్లో జట్టు కట్టనున్నట్లు తెలిపింది. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో కూటమిగా బరిలోకి దిగాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వెల్లడించింది.
ఏయే సీట్లలో ఎవరెవరు పోటీ చేయనున్నారనే విషయంలో త్వరలో ఒక ప్రకటన చేయనున్నట్లు అమరీందర్ సింగ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుపు గుర్రాలను మాత్రమే బరిలో దించాలని తాను రెండు పార్టీల నేతలకు సూచించానని తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్నదే తమ లక్ష్యమని, తాము కచ్చితంగా గెలిచి తీరుతామని అమరీందర్సింగ్ ప్రకటించారు.