చండీగఢ్: ఖలిస్థానీ మద్దతుదారుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ అధినేత అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతున్నది. చెక్పోస్టులు ఏర్పాటు చేసి అమృత్పాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే అభియోగంపై అమృత్పాల్పై మరో కేసు నమోదైంది.
సోమవారం మధ్యాహ్నం వరకు మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీసుల నిలిపివేత కొనసాగనున్నది. కాగా, శనివారం అరెస్టు చేసిన అమృత్పాల్ సింగ్ సలహాదారుడు దల్జీత్ సింగ్ కల్సితో పాటు ముగ్గురిని అస్సాంలోని దిబ్రుగఢ్ సెంట్రల్ జైలుకు తరలించారు. అమృత్పాల్ కోసం పోలీసుల గాలింపును నిరసిస్తూ లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద ఖలిస్థాన్ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. భారత్ జెండాను తొలగించారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రత కల్పించకపోవడంపై ఢిల్లీలోని యూకే రాయబారికి సమన్లు జారీ చేసింది.