సిమ్లా: ఒక పైలట్ అసాధారణ విన్యాసం చేశాడు. తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్పై పారాగ్లైడింగ్ చేశాడు. (Paragliding On E-Scooter) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బండ్ల ధార్లో ఈ సంఘటన జరిగింది. పంజాబ్కు చెందిన హర్షా పైలట్. పారాగ్లైడింగ్లో కూడా ఆయన శిక్షణ పొందాడు. ఈ నేపథ్యంలో గురువారం అసాధారణ ఫీట్ చేశాడు. హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన బండ్ల ధార్ కొండ ప్రాంతంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంతో గాల్లోకి ఎగిరాడు. ఈ-స్కూటర్పై కూర్చొని గాల్లో చక్కర్లు కొట్టాడు. పారాగ్లైడింగ్లో తన నైపుణ్యాన్ని చాటాడు.
కాగా, ద్విచక్ర వాహనంపై కూర్చుని పారాగ్లైడింగ్ చేయడం ఇదే తొలిసారి. దీని కోసం హర్షా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. స్కూటర్ తేలికగా ఉండేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు బ్యాటరీలు తీసేశాడు. చాలా సునాయంతో ఈ-స్కూటర్పై పారాగ్లైడింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పారాగ్లైడింగ్లో హర్షా ప్రతిభను నెటిజన్లు కొనియాడారు. అడ్వెంచర్ స్పోర్ట్స్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
अद्भुत : पंजाब के हर्ष ने बिलासपुर (HP) के आसमान में स्कूटी संग पैराग्लाइडिंग की। उन्होंने जमीन से 200 मीटर से ज्यादा ऊंचाई पर 6-7 KM की उड़ान भरी। pic.twitter.com/YxhOByyspp
— Sachin Gupta (@SachinGuptaUP) December 16, 2023