జలంధర్, అమృత్సర్: పంజాబ్లో మంగళవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ రెండూ సైనిక స్థావరాలకు దగ్గర జరగడంతో అందరిలో ఆందోళన కలిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మొదటి ఘటన జలంధర్లోని బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ వద్ద సాయంత్రం జరిగింది.
రోడ్డు పక్కన ఒక స్కూటర్లో ఉంచిన బాంబు పేలడంతో అది తునాతునకలై పెద్ద శబ్దం వినిపించింది. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ సోషల్ మీడియాలో ప్రకటించినప్పటికీ దాని వాస్తవికతను పోలీసుల ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు ఈ పేలుడు జరిగిన కొన్ని గంటలకే అమృత్సర్లోని ఖాసా రోడ్లో గల కంటోన్మెంట్ సమీపంలో మరొక పేలుడు జరిగింది. దీంతో కంటోన్మెంట్ గోడపై అమర్చిన రేకుల షీట్ దెబ్బ తిన్నది.