చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ నామినేషన్ వేయడానికి బయలుదేరారు. నామినేషన్కు ముందు ఆయన గురుగోవింద్ సాహిబ్ ఖడ్గం నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. పటియాల అసెంబ్లీ నియోజవకర్గం నుంచి స్వతహాగా బరిలో దిగుతున్న అమరీందర్.. నామినేషన్కు ముందు ఖడ్డం ఆశీర్వాదాలు తీసుకున్నారు.
గురుగోవింద్ సాహిబ్లోని మతపెద్దలు ఆయనకు ఖడ్గం ఆశీర్వాదాలు అందించారు. కాగా, పంజాబ్లో ఫిబ్రవరి 20 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా, 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అమరీందర్సింగ్.. కొన్ని నెలల క్రితం అర్థాంతరంగా పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూతో వివాదం కారణంగా కాంగ్రెస్ హైకమాండ్ అమరీందర్ను సీఎం పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది ముందే గుర్తించిన అమరీందర్సింగ్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ను వీడి సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని కూటమిగా బరిలో దిగారు.