న్యూఢిల్లీ : పంజాబ్లో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు లుధియానా కోర్టులో బాంబు పేలుళ్ల కుట్ర జరిగిందని నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యల నేపధ్యంలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) మాజీ క్రికెటర్ టార్గెట్గా విమర్శలు గుప్పించింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూకు ఐఎస్ఐతో ఉన్న సంబంధాలను నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు జరిపించాలని పీఎల్సీ ప్రతినిధి ప్రీత్పాల్ సింగ్ బలియవల్ డిమాండ్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ను సిద్ధూ పెద్దన్నగా పిలుస్తారని, పాక్ టూర్లో సిద్ధూ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బాజ్వాను కౌగిలించుకున్నారని గుర్తు చేశారు. ఐఎస్ఐతో సిద్ధూకున్న సంబంధాలపై భద్రతా సంస్ధలు నిగ్గుతేల్చాలని ఆయన కోరారు.
మరోవైపు లుధియానా బాంబు పేలుళ్లలో ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదని, దీనివెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ అన్నారు. పంజాబ్లో ప్రార్ధనాలయాలను అపవిత్రం చేసిన ఘటనల నుంచి దృష్టి మళ్లించేందుకు జరిగిన కుట్రలో భాగంగానే బాంబు పేలుళ్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు.