చండీఘర్ : కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి జనవరి 15వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. బార్లు, సినిమా హాల్స్, మాల్స్, రెస్టారెంట్లు, స్పా సెంటర్లను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించాలని ఆదేశించింది. ఈ సెంటర్లలో పని చేసే సిబ్బంది.. వ్యాక్సిన్ తీసుకున్న వారై ఉండాలి. ఇక జిమ్ సెంటర్లను పూర్తిస్థాయిలో మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రెండు డోసుల టీకా తీసుకున్న ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక నైట్ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉండనుంది.