Punjab | ప్రధాని మోదీ భద్రతలో తలెత్తిన లోపంపై వివాదం రగులుతూనే వుంది. ఈ విషయం సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్లింది. ప్రధాని ట్రావెల్ రికార్డులను భద్రపరచాలని సుప్రీం పంజాబ్ – హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. అయితే మోదీ భద్రతలో తలెత్తిన లోపంపై పంజాబ్ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధాని ప్రయాణించే హెలికాప్టర్ ఎలాంటి వాతావరణంలోనైనా ప్రయాణించే సామర్థ్యమున్న హెలికాప్టర్ అని, (ఆల్ వెదర్ హెలికాప్టర్) అయినా దానిని ఉపయోగించకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నారని పంజాబ్ సర్కార్ దుయ్యబట్టింది. అంతేకాకుండా ప్రధాని ప్రయాణించే మార్గం కొండలు, గుట్టలున్న ప్రాంతం కూడా కాదని, అయినా ఆ హెలికాప్టర్ను ఉపయోగించలేదని, సభకు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని పంజాబ్ సర్కార్ ఓ జాతీయ న్యూస్ ఛానల్తో వ్యాఖ్యానించింది.