చండీగఢ్: కదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దిక్కుతోచని స్థితిలో కనిపించిన ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కాపాడింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్తో సహా కొందరిని అరెస్ట్ చేశారు. (Girl Gang Raped In Public Bus) ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఈ సంఘటన జరిగింది. పంజాబ్కు చెందిన మైనర్ బాలిక దేశ రాజధాని ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు ఉత్తరాఖండ్ రోడ్వేస్ బస్సులో ప్రయాణించింది. ఆగస్ట్ 12, 13 మధ్య రాత్రి వేళ కదులుతున్న బస్సులో ఆ బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది.
కాగా, మానసిక వికలాంగురాలుగా కనిపించిన ఆ బాలిక డెహ్రాడూన్లోని ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ వద్ద
దిక్కుతోచని స్థితిలో ఉన్నదని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సూపర్వైజర్ సరోజిని తెలిపారు. 13వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆ బాలికను గుర్తించి సంక్షేమ కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్ సహా కొందరిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.