ఒక్కరిని పెండ్లి చేసుకొంటేనే సంసార సాగరం ఈదడం కష్టం. ఇద్దర్ని చేసుకొన్నవాడు కనిపిస్తే ఎలా వేగుతున్నావురా బాబూ.. అని వాపోతాం. అలాంటిది ఈ తాత ముప్పై 37 పెండ్లిళ్లు చేసుకొన్నాడు. పెండ్లి వీడియోను ఐపీఎస్ రూపిన్ శర్మ ట్వీట్ చేశారు. ‘అత్యంత ధైర్యవంతుడు’ అని ట్యాగ్లైన్ పెట్టారు. 28 మంది భార్యలు, 35 మంది పిల్లలు, 126 మంది మనుమలు, మనుమరాళ్ల మధ్య అంగరంగ వైభవంగా పెండ్లి జరిగినట్టు పేర్కొన్నారు. అయితే ఈ పెండ్లి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందన్నదానిపై స్పష్టత లేదు.