చండీఘడ్: పంజాబ్ మాజీ మంత్రి సుచా సింగ్ లంగా కుమారుడు ప్రకాశ్ సింగ్ డ్రగ్స్(Drugs) కేసులో అరెస్టు అయ్యాడు. అతనితో పాటు మరో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో ఓ అమ్మాయి కూడా ఉన్నది. డ్రగ్స్ కలిగి ఉన్న కేసులో హిమాచల్ పోలీసులు షిమ్లాలో అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారి నుంచి 42 గ్రాములు హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. హోటల్లో ఉంటున్న వారిపై పోలీసులు రెయిడ్ చేశారు. మాజీ మంత్రి లంగా కుమారుడు డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు.
గతంలో ప్రకాశ్ సింగ్ను ఓ డ్రగ్స్ కేసులో పంజాబ్ పోలీసులు 2021, మే 3వ తేదీన అరెస్టు చేశారు. ప్రకాశ్తో పాటు అరెస్టు అయిన వారిలో అవ్ని నేగి, అజయ్ కుమార్, శుభం కౌశల్, బల్బిందర్ ఉన్నారు. షిమ్లాలోని ఓల్డ్ బస్స్టాండ్ వద్ద ఉన్న పంచాయ్ ఘర్ సమీప హోటల్లో దొరికారు. నార్కోటిక్ డ్రగ్స్ లభ్యమైనట్లు కేసు బుక్ చేశామని షిమ్లా ఎస్పీ సంజీవ్ గాంధీ తెలిపారు.