చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. చరణ్జిత్ సింగ్ చన్నీ కుటుంబంలో చెందిన ముగ్గురు మహమ్మారి బారినపడ్డారని సీనియర్ ఆరోగ్యశాఖ అధికారి శనివారం తెలిపారు. అయితే, సీఎం చన్నీకి కరోనా నెగెటివ్ అని తేలిందని పేర్కొన్నారు. చన్నీ భార్య కమల్జిత్ కౌర్, ఆయన కుమారుడు నవజిత్ సింగ్, కోడలు సిమ్రధీర్ కౌర్లకు కొవిడ్ పాజిటివ్గా తేలిందని, వారందరికీ తేలికపాటి లక్షణాలున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారంతా ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నారని మొహాలీ సివిల్ సర్జన్ డాక్టర్ ఆదర్శపాల్ కౌర్ తెలిపారు.