ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని ప్రణాళికలు వేసుకున్నారని అన్నారు. ఇది వీలుకాని పక్షంలో అనధికారికంగా పంజాబ్ను పాలించాలని అనుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ ఛానల్తో చెన్నీ మాట్లాడుతూ.. పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కేజ్రీవాల్ అనుకున్నారు. గతంలో కూడా అనుకున్నారు. కానీ.. ఆయన కల నెరవేరేది కాదు. ఆప్ కీ బార్ కేజ్రీవాల్ సర్కార్ అన్న క్యాంపెయిన్కు ఆయన 200 నుంచి 400 కోట్లు ఖర్చు చేశారు. అయినా ప్రజలు ఆమోదించలేదు. అని సీఎం చెన్నీ స్పష్టం చేశారు.
పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ను సీఎం కేజ్రీవాల్ ప్రకటించినా… భగవంత్ మాన్ ఇప్పటికీ వెనకబడిపోయారని, రాష్ట్రాన్ని ఓ రిమోట్ కంట్రోల్లా పాలించాలని కేజ్రీవాల్ ఎత్తులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిని పంజాబ్ ప్రజలు ఎందుకు అంగీకరించాలని సీఎం ప్రశ్నించారు. పంజాబ్లో ఎలాగైనా పాగా వేయాలని కేజ్రీవాల్ అనుకుంటున్నారని, కానీ పంజాబ్ సంస్కృతే ఆయనకు తెలియదని సీఎం చెన్నీ ఎద్దేవా చేశారు.